![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/376220-780x470.webp)
IND vs ENG: యశస్వీ సూపర్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా భారత్
ఇంగ్లండ్తో భారత్ మూడో టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. మొదటి ఇన్నింగ్స్లో తక్కువ స్కోరుకే ఔటైన ఓపెనర్ యశస్వీ జైస్వాల్.. రెండో ఇన్నింగ్స్లో వీరోచిత ఇన్నింగ్స్తో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మార్క్ వుడ్ బౌలింగ్లో యశస్వీ(122 బంతుల్లో 101, 9 ఫోర్లు, 5 సిక్సర్లు ) బౌండరీ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఈ సిరీస్లో రెండు సెంచరీలు, ఓవరాల్గా ఈ ఫార్మాట్లో మూడో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు.
ALSO READ: రాణించిన సిరాజ్.. అనూహ్యంగా కుప్పకూలిన ఇంగ్లాండ్
బౌలర్లకు చుక్కలు
రోహిత్ శర్మ(19) ఔటైన తర్వాత నిలకడగా ఆడిన యశస్వీ.. ఆ తర్వాత ఒక్కసారిగా వేగం పెంచి ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అండర్సన్ బౌలింగ్లో వరుసగా 6, 4, 4 బాదిన యశస్వీ.. ఆ తర్వాత హర్ట్లే ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టాడు. దీంతో పాటు స్పిన్నర్ రెహాన్ అహ్మద్ను సైతం ఊచకోత కోశాడు. మరోవైపు గిల్ హాప్ సెంచరీతో క్రీజులో పాతుకుపోయాడు. యశస్వీ జైస్వాల్.. రిటైర్ట్ కాగా, క్రీజులోకి వచ్చిన రజత్ పాటిదార్ డకౌట్ అయ్యాడు. ప్రస్తుతం గిల్(65), కుల్దీప్ యాదవ్(3) క్రీజులో ఉండగా.. భారత్ 2 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది.