![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/01/cricket.jpg)
క్రికెట్
India Vs South Africa: భారత్, సౌతాఫ్రికా రెండో టెస్ట్ మ్యాచ్.. టాస్ గెలిచిన సఫారీ!
దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా భారత్ నేడు చివరి టెస్ట్ ఆడనుంది. న్యూల్యాండ్స్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఇప్పటికే తొలి టెస్టులో ఓడిన భారత్.. రెండు టెస్టుల సిరీస్లో 0-1 తో వెనుకబడింది. దీంతో రెండో టెస్టులో విజయం సాధిస్తే తప్ప సిరీస్ కాపాడుకోలేరు. ఈ మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని సఫారీలు భావిస్తుంటే.. సిరీస్ సమం చేయాలని టీమిండియా గట్టి పట్టుదలతో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
ఈ మ్యాచ్ లో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. స్పిన్ ఆల్ రౌండర్ అశ్విన్ స్థానంలో రవీంద్ర జడేజా తుది జట్టులో స్థానం దక్కింది. మరో వైపు ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ పక్కన పెట్టి స్పెషలిస్ట్ పేసర్ ముకేశ్ కుమార్ కు అవకాశమిచ్చారు.