తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Rishabh Pant: గుడ్‌ న్యూస్‌.. ఐపీఎల్‌లో రీఎంట్రీ ఇవ్వనున్న పంత్‌!

ఐపీఎల్‌ -17 సీజన్‌ షెడ్యూల్‌ దాదాపుగా ఖరారైంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో భారత క్రీడాభిమానులు ఓ శుభవార్త అందింది. ఈ ఐపీఎల్ మ్యాచ్లకు యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. కాగా, పంత్‌..2022 డిసెంబర్‌ 30న ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌ వెళ్తున్న సమయంలో కారు డివైడర్‌కు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే.

ALSO READ: డబ్ల్యూపీఎల్ కి కౌంట్ డౌన్.. బెంగళూరులో ప్రారంభ వేడుకలు

పూర్తిగా ఫిట్ నెస్..

బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. దాదాపు పూర్తి ఫిట్ నెస్ సాధించిన ఈ ఉత్తరాఖండ్‌ కుర్రాడు.. సుమారు ఏడాదిన్నర తర్వాత క్రికెట్‌ ఆడుతున్నాడు. ఇటీవల ఆలూరులో నిర్వహించిన వార్మప్‌ గేమ్‌లో చురుకుగా కదిలినట్లు ఎన్‌సీఏ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఐపీఎల్‌-17లో ఆడనున్నట్లు ఎన్‌సీఏ పరోక్షంగా హింట్‌ ఇచ్చింది.

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button