TS Government: గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. మరో రెండు గ్యారెంటీలు అమలు
తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా ఇవాళ తెలంగాణ సచివాలయంలో ‘మహాలక్ష్మీ పథకం’, ‘గృహ జ్యోతి’ పథకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను నమ్మి ప్రజలు మమ్మల్ని గెలిపించారని.. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ చిత్తశుద్ధితో ఒక్కో పథకం అమలు చేస్తున్నామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆనాడు సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చారని, అదే విధంగా ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. అయితే అభయహస్తంను చేవెళ్లలో లక్ష మంది మహిళ సమక్షంలో ప్రారంభించాలని అనుకున్నామని, కానీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా సచివాలయంలోనే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.
ALSO READ: 2 వేల కోట్లతో జీనోమ్ వ్యాలీ…5 లక్షల కొత్త ఉద్యోగాలు
దరఖాస్తు చేసుకోవచ్చు..
రాష్ట్రంలో అర్హులందరికీ ఉచిత కరెంట్ ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. 200 యూనిట్ల లోపు కరెంట్ వాడే ప్రతీ ఒక్కరికి మార్చిలో జీరో బిల్లు వస్తుందని చెప్పారు. అర్హత ఉన్నప్పటికీ ఇంకా ఎవరైనా పథకాలకు దరఖాస్తు చేసుకోని యెడల మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. మండల కార్యాలయాల్లో ప్రజాపాలన అధికారికి ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.