Trisha: సమసిన మన్సూర్ అలీ ఖాన్, త్రిష వివాదం.. చివరికి ఏమైంది?
తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్, త్రిష మధ్య కొద్ది రోజులుగా జరుగుతున్న వివాదం సుఖాంతం అయినట్టు తెలుస్తోంది. త్రిషపై ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
Read also: Ranbir Kapoor: ప్రభాస్ పై రణబీర్ సంచలన వ్యాఖ్యలు.. నెట్టింట వైరల్
‘లియోలో త్రిష నటిస్తున్నారని తెలిసి, త్రిషతో నేను చేసే సీన్స్ లో ఒక్కటి అయినా బెడ్రూమ్ సీన్ ఉంటుందని అనుకున్నా ఎందుకంటే నా మునుపటి సినిమాల లాగానే ఈ సినిమాలో హీరోయిన్ అయిన త్రిషను బెడ్రూమ్ కి తీసుకెళ్లవచ్చని అనుకున్నా, కానీ అలా జరగలేదు. కశ్మీర్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సెట్స్లో త్రిషను కనీసం నాకు చూపించలేదు’ అని కామెంట్స్ చేశారు.
దీంతో ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడంతో త్రిష ఘాటుగా స్పందించింది. మన్సూర్ అలీ ఖాన్ నా గురించి నీచంగా, అసహ్యంగా మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చిందని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పుకొచ్చింది. అతనిలాంటి వ్యక్తితో ఇప్పటివరకు స్క్రీన్ స్పేస్ను ఎప్పుడూ పంచుకోనందుకు నేను అదృష్టవంతురాలినని, నా మిగిలిన కెరీర్ లో అతడు లేకుండా చూసుకుంటానని ఎందుకంటే మన్సూర్ అలీ ఖాన్ లాంటి వారి వల్ల మానవాళికి చెడ్డపేరు వస్తుందని త్రిష ట్విట్టర్లో రాసుకొచ్చింది.
Read also: Karthika: పెళ్లి వీడియో షేర్ చేసిన కార్తీక.. నెటిజన్ల కామెంట్స్
ఈవిషయంపై జాతీయ మహిళ కమిషన్ విచారణ చేయాలని తమిళనాడు డీజీపీని ఆదేశించింది. కాగా ఆయన గురువారం విచారణకు హాజరుకావల్సి ఉండగా.. శుక్రవారం వస్తానని వెల్లడించారు. అయితే ఈరోజు మన్సూర్ ఆలీ ఖాన్ ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు. నేను కత్తి లేకుండా ఒక వారం పాటు యుద్ధం చేశా, ఈ యుద్ధంలో రక్తపాతం లేకుండా నేను గెలిచా, నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా వ్యాఖ్యలు త్రిష మనసుకు బాధ కలిగించాయి, అందుకు క్షమాపణలు కోరుతున్నా ఇంతటితో ఈ కళింగ యుద్ధం ముగిసింది’ అంటూ చెప్పుకొచ్చారు.
అయితే ఈ విషయం మీద త్రిష కూడా స్పందించారు. తప్పు చేయడం మానవ నైజం, క్షమించడం దైవత్వం అని ఆమె తాను క్షమిస్తున్నట్టు ఇన్ డైరెక్టుగా ట్వీట్ చేశారు.