తెలుగు
te తెలుగు en English
జాతీయం

Bihar Floor Test: బీహార్‌లో టెన్షన్.. కాసేపట్లో బలపరీక్ష

బీహార్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ సర్కార్ నేడు బల పరీక్ష నిరూపించుకోనుంది. ఆయన మహాకూటమి నుంచి ఇటీివల ఎన్‌డీఏతో కలిసి కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా, రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఆదివారం క్యాంపు రాజకీయాలకు తెర లేపాయి. ఇప్పటికే ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ)కి చెందిన మొత్తం 79 మంది ఎమ్మెల్యేలు రెండు రోజుల నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ నివాసంలో మకాం వేశారు.

ALSO READ: టైమ్స్ నౌ సర్వే.. మళ్లీ ఆ పార్టీదే హవా

కనీసం ఎంతమంది మద్దతు ఉండాలంటే?

కాంగ్రెస్‌కు చెందిన 19 మంది ఎమ్మెల్యేలలో 16 మంది హైదరాబాద్‌కు రాగా.. తిరిగి నేరుగా శ్రీ యాదవ్ నివాసానికి వెళ్లారు. అదేవిధంగా వామపక్షాలకు చెందిన 16 మంది ఎమ్మెల్యేలు కూడా అక్కడికే చేరుకున్నారు. ఇలా శ్రీ యాదవ్ నివాసంలో రాత్రి బస చేసిన 114 మంది ఎమ్మెల్యేలు.. సోమవారం అసెంబ్లీకి బయలుదేరనున్నారు. బీహార్‌ అసెంబ్లీలో 243 మంది సభ్యులు ఉండగా.. ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 122 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే 128 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న ఎన్‌డీఏ సర్కారు విజయం తమదే అని విశ్వాసంతో ఉంది. ఇందులో బీజేపీకి చెందిన 78 మంది, జేడీ(యూ)కి చెందిన 45 మంది, హిందుస్థానీ అవామ్ మోర్చా (సెక్యులర్) నలుగురు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button