తెలుగు
te తెలుగు en English
జాతీయం

ECI: బీజేపీ షాక్.. వికసిత్ భారత్ సందేశాలపై ఈసీ సీరియస్

బీజేపీ ప్రభుత్వానికి బిగ్ షాక్.. వాట్సాప్, సోషల్ మీడియాలో వస్తున్న మోడీ వికసిత్ భారత్ ప్రచారాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత… కేంద్ర ప్రభుత్వం స్వయంగా వికసిత్ భారత్ ప్రచారం చేస్తుందని, వాట్సాప్ ద్వారా ఈ ప్రచారం తీవ్రంగా ఉందని.. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధం అని.. వెంటనే వాట్సాప్ ప్రచారాన్ని బంద్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Also read: PM Modi: రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ఎన్నిక.. ప్రధాని మోడీ ఫోన్

వాట్సాప్ ద్వారా కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ పేరుతో మెసేజులు పంపిస్తుంది. వికసిత్ భారత్ గ్రూప్ ను అన్ని ఫోన్లకు పంపిస్తుంది. వారం రోజులుగా దేశంలోని ప్రతి ఒక్కరి ఫోన్ లోని వాట్సాప్ కు ఈ మెసేజ్ వస్తుంది. వికసిత్ భారత్ వాట్సాప్ ప్రచారంలో పలు పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయి. విచారణలో అది వాస్తవం అని తేలడంతో.. గురువారం ఈ మేరకు ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే ఈ కార్యక్రమాన్ని ఆపాలని ఆదేశించింది.
అలాగే వికసిత్ భారత్ గురించి తగిన నివేదికను సమర్పించాలని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button