తెలుగు
te తెలుగు en English
జాతీయం

Varanasi Court: జ్ఞానవాపి మసీదు కేసు.. వారణాసి కోర్టు సంచలన తీర్పు

జ్ఞానవాపి కేసులో కీలక సన్నివేశం జరిగింది. జ్ఞానవాపి మసీదులో పూజలు చేసేందుకు హిందువులకు వారణాసి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో మసీదు ప్రాంగణంలో హిందూ దేవతల విగ్రహాలు ఏర్పాటు చేసి.. వారం రోజుల్లో పూజలు ప్రారంభిస్తామని కాశీవిశ్వనాథ్‌ ట్రస్ట్‌ పేర్కొంది. ఇది హిందువుల అతిపెద్ద విజయమని కాశీవిశ్వనాథ్‌ ట్రస్ట్‌ వెల్లడించింది.

Also read: Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధానికి మరో దెబ్బ.. మరో కేసులో 14 ఏళ్ల జైలు

జ్ఞాన్‌వాపి మసీదు లోపల మూసి ఉన్న ‘వ్యాస్ కా టెఖానా’ లోపల పూజలు చేసేందుకు వారణాసి కోర్టు హిందూ భక్తులను అనుమతించింది. రాబోయే 7 రోజుల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోర్టు జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. జ్ఞానవాపి మసీదులో సీలు చేసిన నేలమాళిగలో హిందూ భక్తులు పూజలు చేసుకునేందుకు వారణాసి అనుమతించింది. కోర్టు ఆదేశం ప్రకారం, హిందూ భక్తులు ఇప్పుడు వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు లోపల మూసిఉన్న ‘వ్యాస్ కా టెఖానా’లో ప్రార్థనలు చేయవచ్చు.

ఈ కేసులో హిందువుల తరపున వాదనలు వినిపించిన న్యాయవాది విష్ణు శంకర్ జైన్ మాట్లాడుతూ.. ‘వ్యాస్ కా టెఖానా’లో ప్రార్థనలు చేసేందుకు హిందూ పక్షం అనుమతించింది. జిల్లా యంత్రాంగం 7 రోజుల్లో ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికీ అక్కడ పూజలు చేసుకునే హక్కు ఉంటుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button