తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Saindhav: ఓటీటీలోకి వెంకటేశ్ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే.?

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సైంధవ్‌’. ఈ సినిమా భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కిన‌ ఈ సినిమాకి ‘హిట్‌’ ఫేమ్‌ శైలేష్‌ కొలను దర్శకత్వం వహించగా.. వెంకట్‌ బోయనపల్లి నిర్మాతగా వహించారు. తాజాగా, ఈ సినిమా ఓటీటీ లాక్ చేసుకుంది. ఈ సినిమా విడుదలై నెల రోజులు కాకముందే ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్ర‌వ‌రి 3 నుంచి స్ట్రీమింగ్ కానున్న‌ట్లు మేక‌ర్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించారు.

ALSO READ: బాలయ్యతో ఊర్వశి.. పోలీస్ ఆఫీసర్‌గా అవతారం

సైకో పాత్రలో వెంకటేశ్..

నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై నిర్మించిన సైంధవ్‌ చిత్రంలో వెంకటేష్‌, శ్రద్ధా శ్రీనాథ్‌, రుహానీ శర్మ, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆర్య, ఆండ్రియా జెర్మియా ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో సైంధవ్‌ కోనేరు అలియాస్‌ సైకో పాత్రలో కనిపించాడు. కాగా, ఈ చిత్రం మిక్స్ డ్ టాక్ వచ్చిన సైతం థియేటర్‌లో ఎక్కువ మందిని అలరించలేకపోయింది. దీంతో నెల రోజుల కంటే ముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button