Rajinikanth: కడప జిల్లాలో రజినీకాంత్ మూవీ షూటింగ్.. భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్
జైలర్ మూవీ సక్సెస్ తో రజినీ కాంత్ తన తర్వాత మూవీపై ఫోకస్ పెట్టాడు. తలైవా 170 మూవీ వెట్టయాన్ గా (తెలుగులో వేటగాడు) వస్తోన్న ఈ మూవీని జైభీమ్ ఫేం డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ మూవీని తెరకెక్కిస్తున్నాడు.
రజినీ వెట్టయాన్ మూవీ షూటింగ్ కోసం మంగళవారం చెన్నై నుంచి కడప చేరుకున్నారు. ప్రస్తుతం వెట్టయాన్ మూవీ షూటింగ్ వైయస్సార్ జిల్లా ఎర్రగుంట్ల మండలం నిడుజువ్వి గ్రామ సమీపంలోని సానేపల్లె నాపరాయి గనిలో జరుగుతుండగా.. సూపర్ స్టార్ రజనీకాంత్ పాల్గొన్నారు.
Also read: Fighter Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న ఫైటర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
రజినీకాంత్, విలన్ మధ్య జరిగే యాక్షన్ సీన్స్ ఇక్కడ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఎర్రగుంట్ల పురపాలక సంఘానికి చెందిన కౌన్సిలర్ మధుసూదన్ రెడ్డికి చెందిన క్వారీలో ఈ వెట్టయాన్ షూటింగ్ జరుగుతుంది. మొత్తం రెండు రోజుల పాటు సాగే షెడ్యూల్ లో షూటింగ్ మొత్తం ఇక్కడే ప్లాన్ చేసుకున్నట్లు మూవీ టీం చెప్పినట్టు సమచారం.
రజినీకాంత్ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలుసుకున్న ఆయన అభిమానులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రజినీ కాంత్ను చూసేందుకు భారీగా తరలివచ్చారు. ప్రస్తుతం షూటింగ్ కి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో రజినీ పోలీస్ పాత్రలో నటిస్తుండగా.. రజినీకి జోడీగా దీపికా పదుకునే నటిస్తున్నట్లు టాక్. జైలర్ తో ఎలెక్ట్రిఫయింగ్ మ్యూజిక్ అందించిన అనిరుధ్ రవిచందర్ బాణీలు అందిస్తున్నారు. దాదాపు రూ.1000 కోట్ల టార్గెట్ దిశగా రానున్న ఈ మూవీ 2024 సమ్మర్ లో రిలీజ్ కానున్నట్లు సమాచారం. సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికాసింగ్, దుషారా విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.