Assembly: కాంగ్రెస్పై కడియం మండిపాటు… ధీటుగా సమాధానమిచ్చిన మంత్రి శ్రీధర్ బాబు
అసెంబ్లీ సమావేశంలో నేడు ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్పై చర్చ జరుగుతోంది. కోరం లేకపోయినా సభ నిర్వహణపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అభ్యంతరం తెలిపారు. సభలో కోరం ఉండేలా చూడాలన్నారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ కోరం పూర్తి స్థాయిలో ఉందని కౌంటర్ ఇచ్చారు. 10 శాతం సభ్యులు సభలో ఉన్నారని చెప్పారు. కోరం అంటే 12 మంది ఉంటే చాలన్నారు. సభకు బీఆర్ఎస్ నాయకులు సహకరించడం లేదని శ్రీధర్ బాబు మండిపడ్డారు.
Also Read: తెలంగాణలో ఎన్నికల ఎఫెక్ట్… మున్సిపల్ కమిషనర్ల బదిలీ
బడ్జెట్ పై చర్చ జరుగుతుంటే సీఎం సభలో లేరని కడియం అన్నారు. ప్రభుత్వ చిత్తశుద్ధి ఎంటో ఇక్కడ కనిపిస్తోందని… ప్రభుత్వానికి అసెంబ్లీ చర్చపై సీరియస్ నెస్ లేదని విమర్శించారు. సీఎం, ఆర్థిక మంత్రి అనివార్య కారణాల వల్ల సభకు హాజరు కాలేదని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఆర్థిక మంత్రి తర్వాత స్టేట్ మెంట్ ఇస్తారని తెలిపారు.