Beer Sales: తెలంగాణలో ఎన్నికలు.. ఫుల్ గా తాగేశారు
తెలంగాణలో ఎన్నికలు ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం కురిపించింది. ప్రజలు మద్యం కొనుగోళ్లతో రికార్డులు నెలకొల్పారు. ఒక విధంగా చెప్పాలంటే.. మంచినీళ్లలా మద్యం తాగేశారని టాక్. ఎన్నికల సందర్భంగా.. రికార్డు స్థాయిలో బీర్లు అమ్మడుపోయాయి. గత నవంబర్ నెలలో 27 రోజులకు ఏకంగా 21 లక్షల 69 వేల కేసుల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. మరోవైపు 30 లక్షల 44 వేల కేసుల బీర్లు కొనేశారు. అంటే.. సరాసరి రోజుకు లక్ష బీర్ల కేసులు అమ్మకం జరిగాయి. వీటి విలువ సుమారు రూ. 3 కోట్లు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
Also read: E-Mails: బెంగళూరులో బాంబు బెదిరింపులు.. 15 స్కూళ్లకు మెయిల్స్
నవంబర్ 1 నుంచి నవంబర్ 20 మధ్య తెలంగాణలో దాదాపు 22 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయని ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. గతేడాది ఇదే టైమ్ లో దాదాపు 12 లక్షల కేసుల బీర్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఎన్నికల వేళ రాష్ట్రంలో 3 నెలల్లో దాదాపు రూ.8,900 కోట్ల విలువైన లిక్కర్ అమ్ముడుపోయింది.