BRS Party: కాంగ్రెస్ ప్రోటోకాల్ ఉల్లంఘన చేస్తుంది: హరీశ్ రావు
ఓడిపోయిన నేతలతో రిబ్బన్ కటింగ్ లు చేయిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రజాపాలన పేరుతో నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ తప్పుతున్నారని వ్యాఖ్యానించారు. కొమరవెల్లి ఉత్సవాల సమీక్ష సందర్భంగా ఓడిపోయిన నేతను కలెక్టర్ పక్కన కూర్చోబెట్టుకోవడం ఏంటని హరీశ్ రావు ప్రశ్నించారు. నర్సాపూర్ లో ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిని కాదని ఓడిపోయిన నేతనే ‘అభయహస్తం’ దరఖాస్తులు పంచుతున్నారని ఆరోపించారు.
Also Read: రేవంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి స్నేహగీతం… మీరు చూసేయండి!
ఇక, ఫిబ్రవరి నెలాఖరులో పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని, కోడ్ అమల్లోకి వస్తే ఆరు గ్యారెంటీల అమలు సందేహాస్పదం కానుందన్నారు. అలాకాకుండా, గ్యారెంటీలపై ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుని జీవోలు విడుదల చేస్తే కోడ్ వచ్చినా అమలుకు ఎలాంటి ఇబ్బంది ఉందని హరీశ్ రావు సూచించారు. ఆరు గ్యారెంటీలపై కాంగ్రెస్ సర్కారు ఏం చేసినా ఫిబ్రవరి 20 లోపే చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
Also Read: కేటీఆర్ ఆసక్తికర ట్వీట్… ఇది నిజమో? కాదో? మీరే చెప్పండి!
శ్వేత పత్రాలు హామీల ఎగవేతల పత్రాలా? అనే అనుమానం కలుగుతోందన్నారు. వందరోజుల్లో గ్యారంటీలను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోందని, మార్చి 17తో వంద రోజులు పూర్తవుతాయన్నారు. జిల్లాల్లో పర్యటించినపుడు రైతుబంధు ఇంకా తమకు రాలేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్లోపే ఆరు గ్యారంటీల్లోని పదమూడు హామీలు అమలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు.