తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Congress: తెలంగాణ ప్రజలకు కాలం మేలు చేయాలి… రైతుల భవిష్యత్ బాగుండాలి: విజయశాంతి

అసెంబ్లీ సమావేశాలు విధానపరంగా జరగడం రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇదే తొలిసారని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి తెలిపారు. 2014 తర్వాత సమావేశాలు ఇంత సాఫీగా, హుందాగా జరగడం చూశానని చెప్పారు. సచివాలయం కూడా ఇప్పుడు పూర్థిస్థాయిలో పనిచేస్తోందని తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో దాదాపు దశాబ్దపు పరిపాలన అనంతరం ప్రజాస్వామ్య పంథాలో ప్రభుత్వం నడుస్తుందన్నారు.

Also Read: సీఎం రేవంత్ రెడ్డి ఆర్డర్… పోలీసుల నిఘా నీడలో పబ్బులు

ఇది ప్రజా ప్రభుత్వమని, అది ప్రజాస్వామ్య పంథాలో నడుస్తుందని కోట్లాదిమంది ప్రజలకు ఇప్పుడిప్పుడే విశ్వాసం ఏర్పడుతోందని తెలిపారు. 26 సంవత్సరాల పోరాటం తర్వాత ఇప్పుడు ఏం చేయాలని ఎవరైనా తనను అడిగితే.. తెలంగాణ ప్రజలకు కాలం మేలు చేయాలని, ఈ భూమి బిడ్డల భవిష్యత్తు ఎప్పటికీ మంచిగా ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటానని చెబుతూ విజయశాంతి ఎక్స్ లో పోస్టు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button