![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/01/kodandaram.jpeg)
Kodandaram: మంత్రివర్గంలోకి ప్రొఫెసర్ కోదండరాం… సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన ఇదేనా!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మద్దతును కాంగ్రెస్ పార్టీ కోరింది. అందుకు ఆయన కూడా అంగీకరించి కాంగ్రెస్ కు సపోర్టు చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కోదండరాం కి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ ప్రకారమే తాజాగా ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేసింది. ఈ నేపథ్యంలోనే కోదండరాం గురించి ఒక సంచలన న్యూస్ తెలుస్తుంది. ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం.
Also Read: టీడీపీకి ఎదురుగాలేనా? సీట్ల కేటాయింపులో తికమక!
ఎమ్మెల్సీగా నామినేట్ అయిన టీజేఎస్ చీఫ్ కోదండరాం మంత్రి అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయనకు విద్యాశాఖను అప్పగించే యోచనలో సీఎం భావిస్తున్నట్లు సమాచారం. కోదండరాం ప్రొఫెసర్ కావడంతో ఆయనకు కీలకమైన విద్యాశాఖను అప్పగించే బాగుంటుందని రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా అభిప్రాయం వెల్లడవుతుంది. బడ్జెట్ సమావేశాలకు ముందే కేబినెట్ను విస్తరించే యోచనలో ఉన్న రేవంత్రెడ్డి ఈ నెలాఖరులోగానే అందుకు సంబంధించిన కసరత్తు పూర్తిచేసి అధిష్ఠానం నిర్ణయం కోసం పంపనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Also Read: బిగ్ అలర్ట్.. చలాన్లకు ఇంకా మూడురోజులే!
ఈ నేపథ్యంలో మిగిలిన మంత్రి పదవులను ఎవరెవరికి కేటాయించాలనే అంశంపై కూడా అధిష్టానం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ అంశంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.కేబినెట్లో ప్రస్తుతం సీఎం సహా 12 మంది మాత్రమే ఉన్నారు. విస్తరణలో మరో ఆరుగురికి మంత్రి పదవులు దక్కనున్నాయి.