![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/03/pmo.jpg)
PMO: ప్రధాని తెలంగాణ టూర్.. సీఎం రేవంత్ వెళ్తారా?
ప్రధాని నరేంద్ర మోడీ మార్చి మొదటి వారంలో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని మోడీ పర్యటనకు రావాలని ప్రధాని కార్యాలయం నుంచి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం పంపింది. మార్చి 4, 5 తేదీల్లో ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్న ప్రధాని మోడీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నారు.
Also read: Bibi Patil: బీఆర్ఎస్ కు మరో షాక్.. బీజేపీలోకి సిట్టింగ్ ఎంపీ
ఈ కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనాల్సింది పీఎంవో సీఎంను కోరింది. దీంతో రేవంత్ హాజరు విషయం ఆసక్తిగా మారింది. కాగా, గతంలో ప్రధాని మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా.. ప్రధాని కార్యక్రమాలకు అప్పటి సీఎం కేసీఆర్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత తెలంగాణకు వస్తున్న ప్రధాని మోడీకి సీఎం స్వాగతం పలికే అవకాశం ఉంది. ఆయనతోపాటు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొననున్నట్లు సమాచారం.
మార్చి 4న ఆదిలాబాద్లో పర్యటించనున్నారు ప్రధాని మోడీ. ఆదిలాబాద్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అదే రోజున ఆదిలాబాద్ బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం రాజ్భవన్లో బస చేయనున్నారు. ఇక, మార్చి 5న సంగారెడ్డిలో పర్యటించనున్నారు. సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనల అనంతరం బహిరంగసభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తారు.
One Comment