తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Survey: లోక్ సభ ఎన్నికలు… ఇండియా టీవీ ఒపీనియన్‌ పోల్స్‌ విడుదల

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30 న జరిగాయి. ఈ నేపథ్యంలోనే వివిధ సర్వేలు ఏ పార్టీ గెలుస్తుందోనని ఒపీనియన్‌ పోల్స్‌ను విడుదల చేశారు. అప్పటి సర్వేలు చెప్పిన విషయాలు దాదాపుగా కరెక్ట్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా ఇండియా టీవీ లోక్ సభ ఎన్నికల గురించి ఒపీనియన్ పోల్స్ విడుదల చేసింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి బీఆర్‌ఎస్‌కే మెజారిటీ స్థానాలు దక్కుతాయని ఈ సర్వేలో తెలిపింది. తెలంగాణలోని మొత్తం 17 స్థానాలకుగాను 8 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధిస్తుందని ఈ ఒపీనియన్‌ పోల్స్‌ రిపోర్టు స్పష్టం చేసింది. ఓట్ల శాతం పరంగా చూస్తే బీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికల్లో 40 శాతం ఓట్లు దక్కుతాయని తెలిపింది.

Also Read: చెప్పేది ఒకటి చేసేది మరొకటి… షర్మిల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు

బీఆర్‌ఎస్‌ తర్వాత బీజేపీకి అత్యధిక స్థానాలు దక్కుతాయని ఇండియా టీవీ ఒపీనియన్‌ పోల్స్‌ రిపోర్టు తెలుపుతోంది. బీజేపీ 6 లోక్‌సభ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని ప్రకటించింది. ఇక కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితమవుతుందని పేర్కొంది. మిగిలిన ఒక్క స్థానం మజ్లిస్‌ పార్టీ తన ఖాతాలో వేసుకుంటుందని స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button