తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Telangana: పద్మ అవార్డులకు ఎంపికైన వారికి నగదు పురస్కారం… ఎంతంటే?

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి 25 లక్షల నగదు పురస్కారం ప్రకటించింది. అంతేకాదు.. ప్రతి నెల 25 వేల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం శిల్పకళా వేదికలో పద్మ అవార్డు గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. ఈ సందర్భంగా పద్మ అవార్డు గ్రహీతలను సన్మానించడం ఒక బాధ్యతగా భావించామని తెలిపారు.

Also Read: అమ్రపాలికి మరో కీలక బాధ్యతలు… హెచ్‌జీసీఎల్ బాధ్యతలు అప్పగింత

పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు 25 లక్షల నగదు బహుమతి ప్రభుత్వం తరపున అందిస్తామని అధికారికంగా ప్రకటించారు.దీంతోపాటు ప్రతీ నెల పద్మశ్రీ అవార్డు పొందిన కవులు, కళాకారులకు 25వేల పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. సంస్కృతి, సంప్రదాయాలను కాపాడేందుకు మనమంతా ఏకమై ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఒక తెలుగువాడిగా వెంకయ్య నాయుడు రాష్ట్రపతి స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నా అని అభిప్రాయపడ్డారు. మెగాస్టార్ చిరంజీవి జీవిత ప్రస్థానం అందరికీ ఆదర్శమన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button