తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

BRS Party: ‘కాంగ్రెస్ 420 హామీలు’ బుక్ లెట్ విడుదల చేసిన బీఆర్ఎస్ పార్టీ

అధికార కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తోంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై గులాబీ దళం పోరాటం మొదలుపెట్టింది. ఇప్పటికే అసెంబ్లీ వేదికగా ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు ప్రజా ఉద్యమం చేపట్టేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ హామీలు ఇచ్చి మోసం చేస్తోందని ఆరోపిస్తూ ఓ బుక్ లెట్ ను విడుదల చేసింది. ‘కాంగ్రెస్ 420 మోసాలు’ అనే బుక్ లెట్ ను బీఆర్ఎస్ పార్టీ ఆవిష్కరించింది.

Also Read లోక్ సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధం.. నేటి నుంచి సన్నాహక సమావేశాలు

కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం కాంగ్రెస్ మోసపూరితమైన హామీలు ఇచ్చిందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. వందల కొద్ది హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేవలం ఆరు హామీల మాట జపిస్తోందని గులాబీ దళం ఆరోపించింది. ఆరు కాదు 420 హామీలు ఇచ్చారని గుర్తు చేసింది.

Also Read యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఎక్కడ శిక్షణ పొందాడో తెలుసా?

ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసేలా కార్యక్రమాలు ప్రారంభించాలని… కేవలం సాగదీసే ప్రక్రియలకు పాల్పడకుండా.. రానున్న లోక్ సభ ఎన్నికల కోడ్ రాకముందే ఎన్నికల ప్రచారంలో తేదీలతో సహా చెప్పినట్లు మాటకు కట్టుబడి ఉండి హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ కోరుతోంది. కేవలం 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేస్తామంటే ఊరుకునేది లేదని, ఎప్పటికప్పుడు ప్రజలకు గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తామని హెచ్చరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button