![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/ttam-kumar-reddy-780x470.jpg)
Telangana: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల
డిజైన్, నాణ్యత లోపం, అవినీతి వల్లే కాళేశ్వరం దెబ్బతిందని, ప్రాజెక్టు ప్రస్తుతానికి నిరుపయోగమని, అందులో నీటిని నింపలేమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెబ్లీలో తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. ప్రాజెక్టుకు కేసీఆరే చీఫ్ ఇంజినీర్, చీఫ్ డిజైనర్గా వ్యవహరించారని, వైఫల్యంపై ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందిపోయి ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. భారీ నాణ్యతా లోపం ఉందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ స్పష్టం చేసిందన్నారు. కాగ్ రిపోర్ట్ ఆధారంగా బాధ్యులపై చర్యలు ఉంటాయని మంత్రి వెల్లడించారు.
Also Read: కులగణన… బీసీలను మభ్యపెట్టే చర్య: ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖలో జరిగినంత దోపిడీ మునుపెన్నడూ జరగలేదని మంత్రి ఆరోపించారు. కాళేశ్వరానికి 81,911 కోట్లతో సీడబ్ల్యూసీ అనుమతి ఇస్తే గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో వ్యయం 1.47 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. ప్రస్తుత లెక్కల ప్రకారం ఈ ప్రాజెక్టు పూర్తికి 2 లక్షల కోట్లు దాటుతుందన్నారు. గుత్తేదారులకు వేల కోట్లు లబ్ధి చేకూర్చారని కాగ్ నివేదికలో చెప్పిందన్నారు.