తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Medaram: మేడారం భక్తులకు శుభవార్త.. జాతరకు ఉచిత బస్సుల్లో పోదాం పదండి

ప్రపంచంలోనే అతిపెద్ద జాతర.. ఆసియాలోనే మొదటి అతిపెద్ద గిరిజన జాతరకు మేడారం ముస్తాబవుతోంది. రెండేళ్లకు ఒకసారి జరిగే జాతరకు దాదాపు కోటి మంది భక్తుల దాకా తరలివస్తుంటారు. ఈ జాతరకు ఆర్టీసీ ఉచిత బస్సు ఉంటుందా లేదా అనేది చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత బస్సు సదుపాయం కల్పించడం లేదని పుకార్లు వచ్చాయి. అయితే అది అవాస్తవమని.. మేడారం జాతర బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. మినీ మహా కుంభమేళాగా పేర్కొనే ఈ జాతరకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి సమ్మక్క, సారలమ్మ దీవెనలు పొందాలని చెప్పారు.

Also Read బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పులు కాదు… ఆస్తులు సృష్టించింది: కేటీఆర్

ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. ఈ సందర్భంగా సమ్మక్క, సారక్క జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మల జాతర మహా కుంభమేళాను తలపిస్తుందని తెలిపారు. రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు యావత్ దేశం నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారని, వారికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి మేడారం జాతరకు వచ్చే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉంటుందని స్పష్టం చేశారు.

Also Read గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడించేందుకు రెండు జాతీయ పార్టీలు పనిచేశాయి: హరీశ్ రావు

మేడారం జాతరకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండడంతో రద్దీని పరిగణనలోకి తీసుకుని బస్సుల సంఖ్యను పెంచుతున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. మేడారం జాతరకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని.. అవసరమైతే అదనపు నిధులు కూడా ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button