తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Telangana: సీఎం రేవంత్ రెడ్డితో ఇస్రో చైర్మన్ భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్.సోమనాథ్ భేటీ అయ్యారు. సచివాలయానికి వచ్చిన సోమనాథ్ సీఎంతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది.

Also Read: తాగు నీటిపై పొన్నం సమీక్ష… జలమండలికి కీలక ఆదేశాలు

సీఎం రేవంత్ రెడ్డి, ఇస్రో చైర్మన్ ఎస్. సోమనాథ్ సమక్షంలో తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈవో ఎస్ఎన్ రెడ్డి, ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ ప్రకాష్ చౌహన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. అంతకు ముందు సచివాలయానికి వచ్చిన ఇస్రో చైర్మన్ కు సీఎం రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ భేటీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీఎస్ శాంతికుమారితో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇస్రో అధికారులు ఉన్నారు.

5 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button