తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

OTT: ఓటీటీలోకి రెండు కొత్త సినిమాలు.. నేటి అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్

సూపర్ స్టార్ మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘గుంటూరు కారం’ తోపాటు కోలీవుడ్‌ స్టార్ హీరో ధ‌నుష్ నటించిన ‘కెప్టెన్ మిల్ల‌ర్ ’ సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఈరోజు అర్ధరాత్రి నుంచి ఈ రెండు సినిమాలు ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. కాగా, గుంటూరు కారం నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అవుతుండగా.. కెప్టెన్ మిల్ల‌ర్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ రెండు సినిమాలు మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నాయి.

ALSO READ: ఆసక్తిగల నటీనటులకు బంపర్ ఆఫర్… రాంచరణ్‌తో నటించే అవకాశం

రెండు సినిమాలకు సూపర్ రెస్పాన్స్..

త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘గుంటూరు కారం’ మొదటివారంలో రూ.212 కోట్లు వసూలు చేసి దుమ్ము రేపింది. ఇక ఈ మూవీలోని ‘కుర్చీ మడతపెట్టి’ సాంగ్‌కి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తమన్ సంగీతం.. మాస్ అవతారంలో మహేష్ ఆట,పాట చూసి అభిమానులు పండగ చేసుకున్నారు. ఇక అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన ‘కెప్టెన్ మిల్ల‌ర్ ’ వరల్డ్ వైడ్‌గా రూ.150 కోట్లకుపైగా గ్రాస్‌ను, రూ.45 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ రాబట్టింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button