![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/ponnam-1-780x470.webp)
Telangana: శాంతిభద్రతలకు భంగం కలుగుతుంది… బండి సంజయ్ని అడ్డుకోవద్దు: మంత్రి పొన్నం
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహించాల్సి ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలు బండి సంజయ్ యాత్రను అడ్డుకుంటారనే భయంతో పోలీసు భద్రత పెంచితే.. ఇతరత్రా శాంతిభద్రతల పరిరక్షణలో ఇబ్బందులు కలుగుతాయని తెలిపారు. ఈ మేరకు ఫిబ్రవరి 28వ తేదీన ఆయన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి వీడియోను విడుదల చేశారు.
Also Read: బీజేపీకి ప్రజలే గుణపాఠం చెబుతారు: సీపీఐ కార్యదర్శి రామకృష్ణ
ప్రజల ఆశీర్వాదంతో గెలిచి, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో కంకణబద్ధున్నై రాష్ట్ర, నియోజకవర్గ ప్రజలకు సేవలు అందించాలనే కార్యాచరణతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి తన వంతు కృషి చేస్తున్నానన్నారు. బండి సంజయ్ నిర్వహిస్తున్న పాదయాత్రను అడ్డుకోవాలనే ఎలాంటి ఉద్దేశం తమకు లేదని స్పష్టంచేశారు. మతిభ్రమించి మనస్థాపం కలిగించేలా చేసిన వ్యాఖ్యలకు బాధపడినా, ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకూడదనే ఉద్దేశంతో తన నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను… ఎక్కడ కూడా బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకోకండని విజ్ఞప్తి చేశారు.
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good.