CPI: బీజేపీకి ప్రజలే గుణపాఠం చెబుతారు: సీపీఐ కార్యదర్శి రామకృష్ణ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మీద సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఏపీని మోసం చేసిన బీజేపీకి రానున్న ఎన్నికల్లో ప్రజలు గట్టి గుణపాఠం చెప్పాలని అన్నారు. ఇవాళ విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన దేశానికి, రాష్ట్రానికి అసలు బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. ఏపీలో సమావేశాలు పెట్టి, సొంత భజన చేసుకునేందుకు బీజేపీకి సిగ్గుండాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. విభజన హామీల అమలులో కేంద్రం ఏపీపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.
ALSO READ: రైతుల ఖాతాల్లో మూడో విడత పెట్టుబడి సాయం.. ఇది ఐదోసారి!
రాష్ట్రాభివృద్ధికి బీజేపీ ఒక్క రూపాయి కూడా కేటాయించడం లేదని మండిపడ్డారు. దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదరికం, నిరుద్యోగం ఇసుమంతైనా తగ్గిందా అని ప్రశ్నించారు. తిరుపతి వెంకన్న సాక్షిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామంటూ నరేంద్ర మోదీ హామీ ఇచ్చి పదేళ్లయినా ఎందుకు అమలుకు నోచుకోలేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలకు అడుగడుగునా ద్రోహం చేసిన బీజేపీకి ఈ ఎన్నికల్లో తిరస్కారం తప్పదని జోస్యం చెప్పారు.