![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/auto-780x470.webp)
Telangana: ప్రభుత్వానికి ఆటో యూనియన్ హెచ్చరిక… 16న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ ఈ నెల 16న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్కు వాహన సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు తెలంగాణ మోటార్ ట్రాన్సుపోర్ట్ వెహికిల్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు రవాణా శాఖ కమిషనర్ను కలిసి సమ్మె నోటీసును అందించారు. రవాణా రంగ కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న విధానాలకు వ్యతిరేకంగా ఈ బంద్ను నిర్వహించనున్నట్లు తెలిపారు.
Also Read: త్వరలో 15 వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
బంద్కు బీఆర్టీయూ, సీఐటీయూ, ఎఫ్యూటీయూ, ఐఎఫ్టీయూ తదితర సంఘాలు మద్దతు తెలిపాయని టీఏటీయూ ఆటో యూనియన్ తెలిపింది. ఉచిత బస్సు కారణంగా తెలంగాణలో ఆటో డ్రైవర్ల జీవితాలు ఆగమయ్యాయని… వారిని ప్రభుత్వం ఆదుకోవాలని టీఏటీయూ డిమాండ్ చేసింది. రవాణా రంగ కార్మికుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. ఆటోడ్రైవర్లను ఆదుకోవాలని, రవాణారంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆటోడ్రైవర్కు నెలకు రూ. 15 వేలు చెల్లించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.