తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

TS Government: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన చినజీయర్‌స్వామి.. ప్రత్యేక ఆహ్వానం

రామానుజచార్య-108 దివ్య దేశాల ద్వితీయ బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎం రేవంత్‌రెడ్డిని చినజీయర్ స్వామి ఆహ్వానించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి స్వయంగా ఆహ్వాన పత్రిక అందించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు.

ALSO READ: త్వరలో మరో పుణ్యక్షేత్రం నిర్మాణం… ఇది తన అదృష్టమన్న మోదీ

కాగా, గతంలో భగవత్‌ రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరుకావాలని ప్రధాని మోదీని చినజీయర్‌ స్వామి ఆహ్వానించారు. ప్రపంచ శాంతి కోసం చినజీయర్‌ చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ప్రధాని మోదీ అభినందించడంతోపాటు తప్పకుండా వస్తానని హామీ ఇచ్చారు. అయితే గతంలో రామానుజాచార్య విగ్రహం ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ హాజరు కాగా.. అప్పటి సీఎం కేసీఆర్ గైర్హాజరైన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button