![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/1368051-tamilisai-soundararajan-780x470.jpg)
TS Government: త్వరలో రూ.500కే గ్యాస్ సిలిండర్, ఉచిత కరెంట్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. మొదట కాళోజీ కవితతో గవర్నర్ తమిళిసై అసెంబ్లీలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను త్వరలోనే అమలు చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను అమలు చేశామన్నారు. త్వరలోనే మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. అర్హులకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తామన్నారు.
ALSO READ: రాజ్యసభలో ఖాళీకానున్న సీట్లు.. ఎన్నికలకు నేడే నోటిఫికేషన్
బీఆర్ఎస్పై చురకలు
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అప్పగించారని బీఆర్ఎస్కు చురకలు అంటించారు. ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్, 2 లక్షల ఉద్యోగాలపై ఫోకస్ చేశామన్నారు. ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను చక్కబెడతామన్నారు. పదేళ్లుగా నష్టపోయిన సంస్థలను తిరిగి కోలుకునేలా చేస్తామన్నారు.