తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ కేసులో మరో 16 మంది అరెస్ట్.. వారిలో నలుగురు మైనర్లు

బిగ్‌బాస్ సీజన్ -7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను తాజాగా అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసు వ్యవహారంలో మరో 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇందులో 12 మంది మేజర్లు ఉన్నట్లు గుర్తించారు.

Also read: AP Government: ఏపీలో తగ్గిన నిరుద్యోగం.. నాలుగున్నరేళ్లలో భారీగా కొలువులు

వారిని కోర్టులో హాజరు పరిచిన అనంతరం రిమాండ్‌కు తరలిస్తామని అధికారులు తెలిపారు. మిగిలిన నలుగురు మైనర్లను జువెనైల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరు పరచనున్నారు. కాగా, బిగ్‌బాస్ ఫైనల్స్ సమయంలో అన్నపూర్ణ స్టూడియో వద్ద అభిమానుల వాగ్వాదంతో 6 ఆర్టీసీ బస్సుల అద్దాలు, పోలీస్‌ కారుతో పాటు ఇతరుల కార్లు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button