తెలుగు
te తెలుగు en English
మరిన్ని

Brij Bhushan: కుస్తీని వదిలేస్తున్నట్లు ప్రకటించిన సాక్షి మాలిక్

భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఎన్నికయ్యాడు. ఎన్నికల్లో అతనికి పోటీగా నిలిచిన కామ‌న్‌వెల్త్ స్వర్ణ విజేత అనితా షియోరాన్ ఓటమిపాలయ్యారు. టాప్ రెజ్లర్లందరూ ఆమెకే మ‌ద్దతు ఇచ్చినప్పటికీ ఓటమి పాలవ్వటం గమనార్హం. మొత్తం 47 ఓట్లలో సంజ‌య్ సింగ్‌కు 40 ఓట్లు పోల‌య్యాయి.

Also Read: భారత్, సౌతాఫ్రికా వన్డే సిరీస్.. నేడు రసవత్తర పోరు

త‌మ‌ను లైంగికంగా వేధించాడని మ‌హిళా రెజ్ల‌ర్లు ఆరోపించిన బ్రిజ్ భూష‌ణ్ అనుచరుడే రెజ్లింగ్ స‌మాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం వారిని క‌లిచివేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాను రెజ్లింగ్ క్రీడ‌ను వ‌దిలేస్తున్న‌ట్లు భారత మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ చెప్పారు. బ్రిజ్ భూష‌ణ్ కు వ్యతిరేకంగా 40 రోజుల‌ పాటు రోడ్ల‌పై ధ‌ర్నా చేప‌ట్టామ‌ని, ఆ సమయంలో త‌మ‌కు దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లు అండ‌గా నిలిచార‌ని ఆమె తెలిపారు. అయినప్పటికీ ఎన్నిక‌ల్లో వారు మద్దతిచ్చిన అభ్య‌ర్థి ఓట‌మి పాలవ్వడం పట్ల ఆమె భావోద్వేగానికి లోన‌య్యారు.

Also Read: జాతీయ క్రీడా అవార్డుల ప్రకటన.. షమీ​కి అర్జున, చిరాగ్‌, సాత్విక్‌లకు ఖేల్‌రత్న

రెజ్లింగ్ స‌మాఖ్య అధ్య‌క్షుడిగా సంజ‌య్ సింగ్ ఎన్నిక కావ‌డం.. రెజ్లింగ్ భ‌విష్య‌త్తు అంధ‌కారంలోకి వెళ్లిన‌ట్లు ఉంద‌ని రెజ్ల‌ర్ వినోశ్ పోగ‌ట్ తెలిపారు. త‌మ‌కు స్వ‌ల్ప స్థాయిలో మాత్ర‌మే న‌మ్మ‌కం ఉంద‌ని, త‌మ‌కు న్యాయం జ‌రుగుతుంద‌న్న ఆశ ఉన్న‌ట్లు ఆమె చెప్పారు. త‌మ బాధ‌ను ఎవ‌రికి చెప్పుకోవాల‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అయినా తాము ఇంకా పోరాడుతూనే ఉన్నామ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button