Anjali Devi: క్రీడాకారిణి అంజలీ దేవీకి భారీ షాక్… నాలుగేండ్ల నిషేదం విధించిన నాడా
భారత క్రీడాకారిణి అంజలీ దేవీకి భారీ షాక్ తగిలింది. డోప్ పరీక్షలో పట్టుబడిన ఆమెపై జాతీయ డ్రగ్స్ నిరోధక సంస్థ(NADA) ఏకంగా నాలుగేండ్ల నిషేధం విధించింది. హర్యానాకు చెందిన అంజలి.. జూన్లో నిర్వహించిన డోప్ పరీక్షలో ఫెయిల్ అయింది. ఆమె రక్త నమూనాను పరీక్షించగా నిషేధిత జీడబ్ల్యూ 1516 డ్రగ్ పాజిటివ్ వచ్చింది. దాంతో నాలుగేండ్ల పాటు అన్ని రకాల పోటీల్లో పాల్గొనకుండా ఆమెపై సస్పెన్షన్ విధించింది.
Also Read: రోడ్డుపై క్రికెట్ ఆడిన సచిన్… వీడియో వైరల్
గత సంవత్సరం భువనేశ్వర్లో జరిగిన ఇంటర్ స్టేట్ నేషనల్స్ అంజలి అదరగొట్టింది. 400 మీటర్ల రీలె పరుగులో 51.48 సెకన్లలో గమ్య స్థానానికి చేరి బంగారు పతకం సాధించింది. దాంతో, ఆసియా క్రీడలకు క్వాలిఫై అయింది. అంతేకాదు 400 మీటర్ల పరుగులో హర్యానాకే చెందిన నిర్మలా షొరాన్ తర్వాత వేగంగా పరుగెత్తిన ఆరో భారత అథ్లెట్గా 25 ఏండ్ల అంజలి రికార్డు నెలకొల్పింది. 2019లో దోహాలో జరిగిన ప్రపంచ చాంపియన్షిప్లోనూ అంజలి పోటీ పడింది.