India: బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్షిప్… భారత మహిళా షట్లర్ల రికార్డు
బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ చాంపియన్షిప్స్ లో భారత మహిళా షట్లర్లు చరిత్ర సృష్టించారు. మలేషియాలో జరుగుతున్నఈ టోర్నీలో దేశానికి తొలి పసిడి పతకం అందించారు. ఈ టోర్నీ చరిత్రలో ఫైనల్ చేరిన మొదటిసారే భారత బృందం స్వర్ణ పతకం కొల్లగొట్టడం విశేషం. థాయ్లాండ్తో జరిగిన ఫైనల్లో 3-2తో గెలుపొందింది. 17 ఏండ్ల అన్మోల్ ఖార్బ్ సంచలన ఆటతో పొర్న్పిచా చోయకీవాంగ్ను చిత్తు చేసి భారత్కు చారిత్రాత్మక పతకాన్ని అందించింది. లీగ్ దశలోనే చైనా గోడను బద్ధలు కొట్టిన భారత షట్లర్లు క్వార్టర్ ఫైనల్లో హాంకాంగ్ను చిత్తు చేశారు.
Also Read: టీమిండియాకు గుడ్ న్యూస్.. మళ్లీ జట్టులోకి వచ్చేస్తున్న అశ్విన్
ఫైనల్లో ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధుతో పాటు గాయత్రి గోపిచంద్, ట్రెసా జాలీలు సింగిల్స్లో విజయ ఢంకా మోగించారు. సెమీస్లో కంగుతిన్న సింధు టైటిల్ పోరులో సత్తా చాటింది. సుపనింద కటెథాంగ్ను 39 నిమిషాల్లోనే 21-12, 21-12 తో చిత్తు చేసి భారత్ను 1-0 ఆధిక్యంలో నిలిపింది.ఆ తర్వాత గాయత్రి, ట్రెసాలు అద్భుత విజయంతో టీమిండియా 2-0తో థాయ్లాండ్పై పై చేయి సాధించింది. ఇక విజేతను నిర్ణయించే డిసైడర్ మ్యాచ్లో యువకెరటం అన్మోల్ అసాధారణమైన ఆటతో ప్రత్యర్థికి చెక్ పెట్టింది. హోరాహోరీగా సాగిన పోరులో పోర్న్పిచాను 21-14, 21-19తో మట్టికరిపించింది.
Wow, awesome blog structure! How lengthy have
you been running a blog for? you made blogging glance easy.
The whole look of your website is excellent, as smartly as the content material!
You can see similar here sklep