తెలుగు
te తెలుగు en English
జాతీయం

Amit Shah: ఇండియా కూటమి ఓ కౌరవసేన.. అమితా షా సంచలన వ్యాఖ్యలు

ఇండియా కూటమిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. దేశంలో రాజకీయాలు పాండవులు, కౌరవులు అని రెండు పక్షాలుగా విడిపోయాయని అన్నారు. ఎన్డీఏను పాండవుల కూటమితో, ఇండియా కూటమిని కౌరవులతో పోల్చారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పాండువులు.. కౌరవ కూటమిని ఓడిస్తారని చెప్పారు. ఇండియా కూటమిలో ఏడు కుటుంబ పార్టీలు ఉన్నాయని విమర్శించారు. ఆ కూటమిలోని వారికి గెలుపుపై ఎవరికీ నమ్మకంలేదని అన్నారు.

Also read: CM Revanth: సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు.. హైదరాబాద్ అభివృద్ధి చేసిందే వైఎస్, చంద్రబాబు, కేసీఆర్

ఢిల్లీలో జరుగుతోన్న బీజేపీ జాతీయ మండలి కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొన్న అమిత్ షా.. ఇండియా కూటమిపై ధ్వజమెత్తారు. దేశంలో కుటుంబ పార్టీలకు ప్రధాని మోడీ పుల్ స్టాప్ పెట్టారని పేర్కొన్నారు. మోడీ పదేళ్ల పాలనలో దేశంలోని ప్రతి ఒక్క రంగం అభివృద్ది సాధించిందని అన్నారు. రాబోయో ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button