తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Mega Dsc: కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్..హై టెన్షన్

మెగా డీఎస్సీ ప్రకటించాలని ఏపీ కాంగ్రెస్‌ చేపట్టిన ‘చలో సెక్రటేరియట్‌’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. అయితే ఇవాళ విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌ నుంచి ఆ పార్టీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల.. పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా సచివాలయానికి బయలుదేరారు. ఈ క్రమంలో పలుచోట్ల పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

ALSO READ: జనసేనానిపై టీడీపీ క్యాడర్ అసంతృప్తి.. కారణం అదేనా?

ఏపీ సచివాలయానికి బయలుదేరుతుండగా.. ఉండవల్లిలోని కరకట్ట సమీపంలో కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు వెళ్లనీయకుండా భారీగా మొహరించారు. దీంతో షర్మిల అక్కడే రోడ్డుపై బైఠాయించారు. అనంతరం కొండవీటి ఎత్తిపోతల వద్ద షర్మిలను పోలీసులు అరెస్టు చేసి వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button