తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Viral Video: బిర్యానీ కోసం ఎగబడిన ప్రజలు.. చితక్కొట్టిన హోటల్ సిబ్బంది

కొత్త సంవత్సరం సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. హోటల్, పబ్ లు, రిసార్టుల తదితర చోట్ల చెదురుముదురు సంఘటనలు చోటుచేసుకున్నాయి. మద్యం మత్తులో కొందరు యువకులు గొడవకు దిగారు. హైదరాబాద్ లో ఓ హోటల్ సిబ్బంది బిర్యానీ కోసం వచ్చిన వారిపై కర్రలతో దాడి చేశారు.

Also Read వినూత్నంగా న్యూఇయర్ చేసుకున్న కేటీఆర్

హైదరాబాద్ ఆబిడ్స్ లోని గ్రాండ్ హోటల్ వద్ద అర్ధరాత్రి బిర్యానీ కోసం ప్రజలు ఎగబడ్డారు. రద్దీ తీవ్రంగా ఉండడంతో బిర్యానీ ఆర్డర్ల కోసం కొన్ని నిమిషాలు నిరీక్షించాల్సి వచ్చింది. కొందరేమో బిర్యానీ బాగా లేదని హోటల్ సిబ్బందితో గొడవపడ్డారు. ఇలా అన్నీ కలిసి తీవ్ర ఘర్షణకు దారి తీసింది. కొందరు వినియోగదారులు హోటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వినియోగదారులు కోప్పడడంతో హోటల్ సిబ్బంది ఎదురుదాడికి దిగారు. కర్రలతో దాడికి దిగారు. పొడవాటి కర్రలతో కస్టమర్లను విచక్షణా రహితంగా కొట్టారు. ఈ సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Also Read మంత్రి రజనీ కార్యాలయంపై దాడి.. గుంటూరులో ఉద్రిక్తత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button