![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/03/patna.jpg)
ప్రత్యేక కథనం
Patna Court: పాట్నా కోర్టులో పేలుడు.. ఇద్దరు మృతి
బీహార్ రాజధాని పాట్నాలోని సివిల్ కోర్టు ఆవరణలోని ట్రాన్స్ ఫార్మర్ పేలింది. దీంతో భారీగా మంటలు కమ్ముకున్నాయి. ఘటనలో ఓ న్యాయవాదితో పాటు ఓ షాప్ యజమాని ప్రాణాలు కోల్పోయారు. న్యాయవాదిని దేవేంద్ర ప్రసాద్గా గుర్తించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also read: Vada Pav: వడాపావ్ కు ప్రపంచ గుర్తింపు.. బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ గా ఎంపిక
ఈ ఘటనతో కోర్టులోని న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు వారికి నచ్చజెప్పి ఇళ్లకు పంపుతున్నారు. సివిల్ కోర్టు కాంప్లెక్స్ లోని గేట్ నంబర్ వన్ దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ పేలుడంతో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
One Comment