![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/HEAT-780x470.jpg)
ప్రత్యేక కథనం
TS: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. మార్చి నుంచి పెరగనున్న ఎండలు
తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. మార్చి నాటికి ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్రం లో 32 నుంచి 37 డిగ్రీల మధ్యన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 డిగ్రీల ఉష్ణోగ్రతల పెరుగుదల ఉండనుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే వడగాలుల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.
ALSO READ: హిమాచల్ ప్రదేశ్ సీఎంగా ప్రతిభా సింగ్?
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి..
మార్చిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం రాత్రి వేళలో తక్కువగా ఉన్నా.. పగటి సమయాల్లో మాత్రం ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. గతేడాది ఫిబ్రవరి చివరి వారంలో 15-20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.