TSRTC: ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం… రెండు బస్సులు దగ్ధం
హైదరాబాద్ దిల్సుఖ్నగర్ ఆర్టీసీ డిపోలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. డిపోలో నిలిపి ఉంచిన ఓ సిటీ ఎక్స్ప్రెస్ బస్సులో ఒక్కసారిగా నిప్పు అంటుకుంది. క్రమంగా వ్యాపించిన మంటలు పక్కనే ఉన్న మరో బస్సుకు అంటుకోవడంత రెండు బస్సులు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.
Also Read: ఇద్దరు మహిళలు ఆర్టీసీ బస్సులో ఏం చేస్తున్నారో చూస్తే ఆశ్చర్యపోతారు!
అయితే ప్రమాదానికి గల కారాణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. ప్రమాదం సమయంలో డిపోలో చాలా బస్సులు పార్కింగ్ చేసి ఉండటం, మంటలు రెండు బస్సులకు పరిమితం కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, ఇంజిన్ విద్యుదాఘాతానికి గురై మంటలు వ్యాపించి ఉండొచ్చని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సమీపం లో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను ఆధారంగా దర్యాప్తు కొనసాగించనున్నారు.