తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Astrotalk: భారత్, ఆస్ట్రేలియా ఫైనల్.. బంపర్ ఆఫర్ ఇచ్చిన ఓ సీఈవో

భారత్, ఆస్ట్రేలియా మధ్య అహ్మదాబాద్ లో జరగనున్న క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు ముందు ఓ కంపెనీ తన కస్టమర్లకు బంపరాఫర్ ప్రకటించింది. ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే రూ.100 కోట్లను పంచుతామని ఆస్ట్రాలజీ కంపెనీ ఆస్ట్రోటాక్ అధినేత, సీఈవో పునీత్ గుప్తా ప్రకటించారు.

Read also: Dhoni: సొంత ఊరు వెళ్లిన ధోని.. కారణం అదేనట!

‘‘ఇండియాలో క్రికెట్ చాలా ఫేమస్. ఈ స్పోర్ట్ దేశం మొత్తాన్ని ఏకతాటిపై నడిపిస్తుంది. మ్యాచ్ కోసం అందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఆస్ట్రోటాక్ యూజర్స్ కు ఆ ఉత్సాహన్ని రెట్టింపు చేయాలనుకున్నాం. కంపెనీ లాభాలను మా కస్టమర్స్ అందరికి పంచాలని నిర్ణయించుకున్నాం. భారత్ మ్యాచ్ ను బాగా ఆడి దేశానికి కప్ ను అందిస్తుందని ఆశిస్తున్నాం’’ అని ఆయన తెలిపారు.

కాగా, ఆస్ట్రోటాక్ కంపెనీకి దాదాపుగా 3 కోట్లకు పైగా యూజర్స్ ఉన్నారు. ఒకవేళ ఇండియా మ్యాచ్ గెలిస్తే సీఈవో ఆఫర్ మేరకు వీరందరికీ రూ.100 కోట్లను పంపిణీ చేయాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button