తెలుగు
te తెలుగు en English
క్రికెట్

CCL: ఉప్పల్ స్టేడియంలో సెలబ్రెటీ క్రికెట్ లీగ్.. టిక్కెట్ రేట్ ఎంతంటే?

ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా సెలబ్రెటీ క్రికెట్ లీగ్ మ్యాచ్ లు జరగనున్నాయి. నేటి నుంచి మ్యాచ్ లు ప్రారంభంకానున్నాయి. హైదరాబాద్‌లో మొత్తం ఆరు మ్యాచ్‌లు జరగనుండగా, రోజుకు రెండు చొప్పున మార్చి 1 నుంచి 3 వరకు ఆరు మ్యాచ్‌లకు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. తొలిరోజు చెన్నై రైనోస్ vs భోజ్‌పురి దబాంగ్స్, తెలుగు వారియర్స్ vs పంజాబ్ ది షేర్ జట్లు తలడనున్నాయి. ఈ మ్యాచ్ లకు టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌, సాండిల్‌వుడ్‌కు చెందిన పలువురు సినీ తారలు హాజరుకానున్నారు.

Also read: BCCI: ధర్మశాల టెస్టుపై టీమిండియా కసరత్తు.. జట్టులోకి కొత్త ఆటగాడు?

సీసీఎల్ మ్యాచ్ ల టికెట్ల ధర కనిష్టంగా రూ.99, గరిష్ఠంగా రూ. 499గా నిర్ణయించారు. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ చూడాలనుకునేవారికి ఇదొక చక్కని అవకాశం. https://ticketgenie.in/Event/Celebrity-Cricket-League-2024 వెబ్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. తొలి మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 6:30 గంటలకు ప్రారంభంకానున్నాయి. భారతదేశంలో సిసిఎల్ మ్యాచ్‍లు సోనీ టెన్ 5 ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి. అలాగే, డిజిటల్‌గా చూడాలనుకునేవారు జియో సినిమాయాప్ లో ప్రత్యక్ష ప్రసారాలు చూడవచ్చు.

ఈ లీగ్ లో మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. తెలుగు వారియర్స్, ముంబై హీరోస్, కేరళ స్ట్రయికర్స్, భోజ్‌పురి దబాంగ్స్, బెంగాల్ టైగర్స్, చెన్నై రైనోస్, కర్ణాటక బుల్డోజర్స్, పంజాబ్ ది షేర్ జట్లు ఆడనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button