తెలుగు
te తెలుగు en English
క్రికెట్

Mumbai Indians: హార్దిక్ పాండ్యా కోసం రూ. 100 కోట్లు.. ఏ జట్టు ఇచ్చిందంటే?

ఐపీఎల్ 2024 ముందు అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దుబాయ్ వేదికగా జరిగిన మినీ వేలంలో ఆయా జట్లు రికార్డు ధరలకు ప్లేయర్లను కొనుగోలు చేశాయి. అయితే గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ముంబై జట్టు రిటైన్ చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ముంబై జల్లు గుజరాత్ జట్టుకు భారీ బదిలీ రుసుమును చెల్లించినట్లు ఊహాగానాలు వెల్లువెత్తున్నాయి.

Also read: Suryakumar Yadav: టీమిండియాకు భారీ షాక్.. జట్టుకు దూరం కానున్న కీలక ప్లేయర్?

ముందుగా గుజరాత్ జట్టుతో ముంబై జట్టు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. గుజరాత్ జట్టుకు దాదాపు 100 కోట్ల రూపాయలు చెల్లించనున్నట్లు సమాచారం. అయితే ముంబై జట్టు ఇలా చేయడానికి ప్రధాన కారణం 2025 లో జరగబోయే ప్రధాన వేలం అని తెలుస్తుంది. భవిష్యత్తులో తమ జట్టు పటిష్టత కోసం పాండ్యాకు భారీ మొత్తంలో వెచ్చించడానికి ముంబై సిద్ధమైందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button