తెలుగు
te తెలుగు en English
క్రికెట్

U-19 World Cup: భారత్, ఆసీస్ ఫైనల్స్.. మళ్లీ కప్పు కొడతారా?

మరోసారి ఆస్ట్రేలియాతో భారత్ క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ ఆడబోతుంది. అయితే ఈ సారి కుర్రాళ్లు ఆసీస్ తో ఆడేందుకు సిద్ధమయ్యారు. అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా ఫైనల్ కు చేరుకున్నాయి. తొలి సెమీ ఫైనల్లో ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై భారత కుర్రాళ్లు 2 వికెట్ల తేడాతో విజయం సాధించారు. సాధారణ లక్ష్యమే అయినా సఫారీ బౌలర్ల ధాటికి కుర్రాళ్లు మొదట తడబడ్డారు. దీంతో 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయారు.

Also read: Neeraj Chopra: నీరజ్ చోప్రాకు అరుదైన గౌరవం.. స్విట్జర్లాండ్ లో అపురూప సత్కారం

ఈ దశలో సచిన్ దాస్, కెప్టెన్ ఉదయ్ భారీ భాగస్వామ్యంతో జట్టుకు ఫైనల్ కు చేర్చారు. మరో సెమీ ఫైనల్లో గురువారం పాక్ పై ఆసీస్ ఒక వికెట్ తేడాతో గెలిచి థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. పాక్ బౌలర్ల ధాటికి 180 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ చివరి ఓవర్ వరకు తీసుకెళ్లాల్సి వచ్చింది. దీంతో భారత్, ఆస్ట్రేలియా ఆదివారం టైటిల్ కోసం తలబడతాయి. మూడు నెలల క్రితం టీమిండియా సీనియర్ క్రికెట్ జట్టు ఆసీస్ మీద ఓడిపోయిన తర్వాత మరోసారి కుర్రాళ్లతో కూడిన ఈ రెండు దేశాలు ఫైనల్ కు చేరుకున్నాయి. దీంతో ఆసీస్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఇండియన్ ఫ్యాన్స్ కోటి ఆశలతో ఎదురు చుస్తున్నారు.

అండర్ 19 మ్యాచ్ అయినా ఈ ఫైనల్ మ్యాచ్ కు భారీ క్రేజ్ ఉండటం ఖాయం. ఎందుకంటే ఆసీస్ పై రివెంజ్ తీర్చుకునేందుకు ఇదే మంచి సమయమని మన ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్ కోసం ఇరుజట్లు కసరత్తు చేస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button