తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Politics: ట్రెండింగ్‌లో ‘సిద్ధం’.. సోషల్ మీడియాలో వైరల్!

ఉత్త‌రాంధ్ర‌లోని భీమిలి నుంచి ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి వైసీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌ శంఖం పూరించారు. ఈ మేరకు భీమిలి స‌భతో పాటు దెందులూరులో నిర్వ‌హించిన సిద్ధం స‌భలు సూప‌ర్ స‌క్సెస్ అయ్యాయి. దీంతో వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరగడంతో సీఎం జగన్ ప్రజా క్షేత్రంలో దూసుకుపోతున్నారు ఈ క్రమంలో ఇవాళ అనంతపురం జిల్లా రాప్తాడులో మూడో ‘సిద్ధం’ సభకు సిద్ధమయ్యారు. ఈ సభకు రాయలసీమ ప్రాంతంలోని 52 నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు భారీ ఎత్తున తరలివచ్చారు. సీఎం జగన్‌కు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. ప్రత్యేకించి యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ALSO READ: రాజకీయ చరిత్రలో తొలిసారి..నరసరావుపేట ఎంపీ టికెట్‌ బీసీకే!

ఫొటోలతో సోషల్ మీడియా షేక్..

‘సిద్ధం’ సభా ప్రాంగణం ఫొటోలతో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ నిండిపోయింది. ప్రస్తుతం ‘సిద్ధం’ కార్యక్రమం ట్రెండింగ్‌లో నిలిచింది. ఎక్స్‌(ట్విట్టర్‌)లో దేశంలోనే మొదటిస్థానంలో ‘సిద్ధం’ హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. దీంతో సిద్ధం అప్‌డేట్స్‌ను వైసీపీ అభిమానులు షేర్‌ చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో విజయమే లక్ష్యంగా పార్టీ సన్నద్ధం చేస్తుంది. ఇప్పటికే 65 శాసనసభ, 16 లోక్‌సభ స్థానాలకు సమన్వయకర్తలను నియమించారు.

ALSO READ: రాజ్యసభలో ఉనికి కోల్పోతున్న టీడీపీ! క్యాడర్‌లో గందరగోళం

రెండింటికంటే మిన్న‌గా..

వైసీపీ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి భీమిలిలో, ఉత్తర కోస్తా ప్రాంతానికి సంబంధించి ఏలూరులో ‘సిద్ధం’ పేరుతో సభలు నిర్వహించారు. తాజాగా, రాయలసీమలో పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేసేందుకు అనంతపురానికి సమీపంలో రాప్తాడులో ఆ రెండింటికంటే మిన్న‌గా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ స‌భ‌లో ఎన్నిక‌ల మేనిఫెస్టోకు సంబంధించి కీల‌క అంశాలు ప్ర‌క‌టించే అవ‌కాశాలున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button