AP Politics: పవన్ కల్యాణ్ను మోసం చేసిన చంద్రబాబు.. అసలు విషయం ఇదే?
ఆంధ్రప్రదేశ్లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు అంశం ఇప్పటికే ఖాయమైన సంగతి తెలిసిందే. అయితే ఇదే సమయంలో టీడీపీ, జనసేన పొత్తులో జనసేన పార్టీకి కేటాయించే స్థానాలపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయించే స్థానాలపై ఇరు పార్టీల నేతల మధ్య ఇప్పటికే పలు దఫాలు చర్చలు జరిగాయి. కాగా, పోటీ చేయనున్న స్థానాల పరిధిలోని నియోజకవర్గాలను ఎంచుకొని పవన్ సమీక్ష జరిపారని జనసేన పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.
ALSO READ: ప్యాకేజీ నిజమే.. టీడీపీలో విలీనం దిశగా జనసేన?
నిరాశకు లోనైన పవన్..
టీడీపీ, జనసేన పొత్తులో జనసేనకు 22 సీట్లు ప్రతిపాదించడంతో పవన్ కల్యాణ్ షాక్కు గురయ్యారని సమాచారం. ఎందుకంటే.. జనసేన పార్టీ కనీసం 35 స్థానాల్లో పోటీ చేసే ఆలోచనలో ఉండగా… టీడీపీ అధినేత కేవలం 22 సీట్లు మాత్రమే ఇవ్వనున్నట్లు తెలియడంతో పవన్ కల్యాణ్ తీవ్ర నిరాశకు లోనయ్యారని తెలుస్తోంది. అయితే జనసేన పార్టీ రాజకీ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాత్రం 25 సీట్లతో డీల్ క్లోజ్ చేసేలా పవన్ కల్యాణ్తో ఒప్పందం కుదిరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ జనసేనకు 25 సీట్లకు మించి ఇవ్వకపోతే కాపు సామాజికవర్గ ఉనికికి ముప్పు తెచ్చేలా కనిపిస్తోందని, పవన్ కల్యాణ్కు తన క్యాడర్, కాపు సామాజికవర్గం ముందు విలువ ఉండదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, జనవరి 9వ తేదీని టీడీపీ పవన్ కళ్యాణ్కు ఆఫర్ ఇవ్వడానికి గడువు విధించింది.
ALSO READ: రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం… లోకేష్ కు గిఫ్ట్ పంపిన షర్మిల
ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ.. సమాచారం లేదా?
టీడీపీ నేత నారా లోకేష్ అసలు సీఎంగా పవన్ కల్యాణ్కు అసలు అవకాశం లేదంటూ చేసిన వ్యాఖ్యలపై జనసేన నేతలు, పవన్ మద్దతు దారులు రగిలిపోతున్నారు. ఈ వ్యాఖ్యలు ఉద్దేశ పూర్వకంగానే చేసినట్లు భావిస్తున్నారు. కాగా, ప్రశాంత్ కిషోర్తో మీటింగ్కు కూడా సమాచారం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ వేళ పార్టీ నేతల్లో పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అయితే ఈ విషయంలో జనసేనకు ప్రాధాన్య తగ్గిస్తే సహించేది లేదని జనసైనికులు స్పష్టం చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్కు మాత్రం రాజకీయాల్లో ఎవరిని నమ్మాలనే విషయంపై అర్థం కావడం లేదు. మరి చంద్రబాబు లాంటి నాయకుడిని నమ్మొదని చెప్పి.. అరెస్ట్ నేపథ్యంలో రాజమండ్రి జైలు సాక్షిగా పొత్తుతో పుల్ సపోర్ట్ ఇచ్చి అడ్డంగా బుక్కాయ్యాడు. ఈ విషయంలో పలువురు రాజకీయ పెద్దల నాయకులను పవన్ కల్యాణ్ పక్కనపెట్టి గుడ్డిగా సపోర్ట్ చేయడంతోపాటు పవన్ కల్యాణ్ తన చేతులతోనే టీడీపీ అనే పాముకు పాలు పోసి పెంచి పోషించగా.. అది చివరికి తననే కాటేసేందుకు సిద్ధమైనట్లు అర్థం అవుతోంది. మరోవైపు నాదేండ్ల మనోహర్ పార్టీ విషయంలో కొంత నిరుత్సాహ పరుస్తున్నట్లు కనిపిస్తోంది. జనసేనకు 25 కంటే ఎక్కువ పోటీ చేసే బలం లేదని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.