తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Mohmood Ali: గణతంత్ర వేడుకల్లో అపశృతి.. కిందపడిపోయిన మాజీ మంత్రి

దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుతున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రజలంతా జాతీయ పతకాలను పట్టుకుని తమ దేశభక్తిని చాటుతున్నారు. తెలంగాణలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇక తెలంగాణ భవన్ లో జరుగుతున్న గణతంత్ర వేడుకల్లో అపశృతి దొర్లింది. బీఆర్ఎస్ నేత, మాజీ హోంమంత్రి మహమూద్‌ అలీ అస్వస్థతకు గురయ్యారు. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన.. జెండా ఆవిష్కరిస్తున్న సమయంలో కింద పడిపోయారు.

Also read: Pawan Kalyan: జనసేనాని కీలక వ్యాఖ్యలు.. సీట్ల కేటాయింపులో తగ్గేది లేదన్న పవన్

దీంతో ఇతర నేతలు మహహూద్‌ అలీని పైకి లేపే ప్రయత్నం చేశారు. వెంటనే ప్రాథమిక చికిత్స అందించి ఇంటికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు ప్రమాదంలేదని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button