తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Breaking: మాజీ సీఎం కేసీఆర్ కు తీవ్ర గాయం.. ఆందోళనలో పార్టీ నాయకులు

బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు (KCR) తీవ్ర గాయమైంది. బాత్రూమ్ లో కాలు జారిపడడంతో కేసీఆర్ కు గాయాలయ్యాయి. వెంటనే హుటాహుటిన యశోద ఆస్పత్రికి (Yashoda Hospital) తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్యం బాగానే ఉందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా, కేసీఆర్ కు గాయం విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. కొందరు ఆస్పత్రికి తరలివచ్చి కేసీఆర్ ఆరోగ్యం ఆరా తీస్తున్నారు.

Also Read: ఎవరూ నిరాశకు గురికావద్దు… ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే: కేటీఆర్

ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ (Farm House)లో ఉంటున్న కేసీఆర్ గురువారం రాత్రి బాత్రూమ్ (Bathroom)లో కాలు జారి కింద పడ్డారు. ఆ సమయంలో కాలికి తీవ్ర గాయమైంది. నడవలేని పరిస్థితిలో ఉండడంతో వెంటనే అర్ధరాత్రి హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. కేసీఆర్ ను పరిశీలించిన వైద్యులు (Doctors) ఎడమ కాలి తుంటి ఎముకకు ఫ్రాక్చర్ అయ్యిందని వైద్యులు నిర్ధారించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం శస్త్ర చికిత్స చేయాలా వద్దా అనేది వైద్యులు నిర్ణయిస్తారు. ప్రస్తుతమైతే కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు.

Also Read ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుంది: రాజాసింగ్

కాగా అసెంబ్లీ ఫలితాల వెల్లడైన రోజు నుంచి కేసీఆర్ ఎర్రవల్లిలోని (Erravalli) ఫామ్ హౌస్ లోనే ఉంటున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులతో వరుసగా సమావేశం అవుతున్నారు. పదవి నుంచి దిగిపోవడంతో పార్టీ శ్రేణులు, ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు సంఘీభావం తెలుపుతూ పెద్ద ఎత్తున ఫామ్ హౌస్ కు ప్రజలు తరలివస్తున్నారు. వారికి ఒకసారి కనిపించి అభివాదం చేసి వెళ్తున్నారు. ఈ సమయంలో ఇలా జరగడం ఆందోళన కలిగిస్తోంది. కేసీఆర్ కోలుకోవాలని ప్రజలు, పార్టీ నాయకులు ప్రార్థనలు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button