తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

TS: మెట్రో ఆపాలని కుట్రలు.. సీఎం వార్నింగ్

హైదరాబాద్ అభివృద్ధికి అడ్డుపడితే నగర బహిష్కరణ తప్పదని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని బైరామాల్ గూడ ప్లై ఓవర్ ను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు తాము ప్రయత్నిస్తుంటే కొంతమంది పాతబస్తీలో మెట్రో ఆపాలని చూస్తున్నారని.. మెట్రోను ఆపాలని కేంద్రానికి పదేపదే చెబుతున్నారని సీఎం అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి విషయంలో రాజీపడమని చెప్పారు.

ALSO READ: ఎంపీ బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు

మెట్రో రైలును విస్తరిస్తాం

నగర ప్రజల అవసరాలు తీర్చే విధంగా మెట్రో రైలును విస్తరిస్తామన్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం వరకు మెట్రో రైలు సేవలు అందిస్తామని చెప్పారు. ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు మెట్రోను పొడిగించినట్లు తెలిపారు. రాజేంద్రనగర్‌లో హైకోర్టు నిర్మించి అక్కడి వరకు మెట్రో నిర్మిస్తామన్నారు. రూ.50వేలకోట్లతో మూసీ నదిని ఆధునికీకరించనున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ చుట్టూ ఔటరింగ్‌ రోడ్డు నిర్మించింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనన్నారు. కాగా, ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా సాగర్‌ కూడలిలో రూ.148.05కోట్లతో సెకండ్‌ లెవల్‌ వంతెన అందుబాటులోకి రావడంతో సాగర్‌రింగ్‌రోడ్‌ కూడలిలో ట్రాఫిక్‌ కష్టాలు పూర్తిగా తీరనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button