![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/Telangana-election-780x470.webp)
TS Elections: టైమ్స్ నౌ సర్వే.. మళ్లీ ఆ పార్టీదే హవా
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీ కాంగ్రెస్తోపాటు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, ఇతరపార్టీలు తమ వ్యూహాలకు పదను పెడుతున్నాయి. కాగా, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టాయి. అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఎంపీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. తాజాగా, తెలంగాణలో ఎంపీ ఎన్నికలపై టైమ్స్ నౌ మాట్రిజ్ ఎన్ సీ సర్వే చేసి ఫలితాలు వెల్లడించింది.
ALSO READ: ఏ మొహం పెట్టుకొని వస్తున్నవ్.. కేసీఆర్ బహిరంగ సభను బహిష్కరించాలని పిలుపు
ఓటింగ్ షేర్ శాతంలోనూ..
రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని ఎంపీ సీట్లు గెలుచుకుంటుందా? అనే విషయంపై టైమ్స్ నౌ మాట్రిజ్ ఎన్ సీ చేపట్టిన సర్వేలో మళ్లీ కాంగ్రెస్ తన విజయయాత్రను కొనసాగిస్తుందని తెలిపింది. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా.. ఇందులో గరిష్టంగా తొమ్మిది సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుందని ఆ సర్వే వెల్లడించింది. ఇక బీజేపీ 5, బీఆర్ఎస్ 2, ఎంఐఎం 1 స్థానాల్లో గెలుస్తాయని తేల్చింది. ఓటు షేర్ విషయానికి వస్తే కాంగ్రెస్ 40.4, బీజేపీ 22.6, బీఆర్ఎస్ 28.1, ఎంఐఎం 3.3, ఇతరులకు 5.6 శాతం నమోదవుతాయని ఈ సర్వే తేల్చింది.