![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/03/313460-revanth.webp)
TS Government: ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో రూ.15,718 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. వీటిలో ఎక్కువగా విద్యుత్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ సందర్భంగా సీఎం ఎనుముల రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాసేపటి క్రితం ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్నారు.
ALSO READ: కేటీఆర్పై మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపనలు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో నిర్వహించే మోదీ భారీ బహిరంగ సభ కంటే ముందుగా జిల్లాలో పలు అభివృద్ధి పనులకు వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేయనున్నారు. ఇందులో రామగుండం నేషల్ థర్మల్ పవర్ ప్రాజెక్టు, హైదరాబాద్ నుంచి భూపాలపట్నం వరకూ రూ.2,136 కోట్లతో నిర్మించిన నేషనల్ హైవే 163ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో గవర్నర్, సీఎం, కేంద్రమంత్రి పాల్గొంటారు.