![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/01/KTR-Formula-E-Prix.jpg)
Formula: ఈ రేసు రద్దు నిర్ణయం దారుణం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం..
భారతదేశంలోనే తొలిసారిగా ఫార్మూలా -ఈ రేసు హైదరాబాద్ గడ్డపై జరగ్గా.. మరో రేసు జరగాల్సి ఉంది. అయితే అకస్మాత్తుగా ఆ రేసు రద్దయ్యింది. తెలంగాణలో ప్రభుత్వం మారడంతో ఫిబ్రవరి 10న రేసు నిర్వహణపై ఏర్పడిన సందిగ్ధత చివరికి రద్దుకే దారి తీసింది. రేసు రద్దుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. హైదరాబాద్ నగర ఖ్యాతిని ప్రపంచ నలువైపులా చాటి చెప్పే ఈ రేసు రద్దు కావడంపై క్రీడా అభిమానులు, రేసు ప్రియులు మండిపడుతున్నారు. ఈ రేసును హైదరాబాద్ కు తీసుకురావడానికి నాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ తీవ్రంగా కృషి చేశారు. ఇప్పుడది రద్దవడంతో కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధికి ఆటంకం కలిగించే నిర్ణయాలు తీసుకోవడం సరికాదని హితవు పలికారు.
Also Read ప్రజాపాలన దరఖాస్తులకు ఈరోజే ఆఖరు.. గడువు పెంపు ఉంటుందా?
‘కాంగ్రెస్ ప్రభుత్వం దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఈ రేసు అనేది ఒక్క హైదరాబాదే కాదు దేశ ఖ్యాతిని చాటి చెప్తుంది. ఫార్మూలా ఈ ప్రిక్స్ రేసును భారత్ కు తీసుకురావడంలో మేం అవిరళ కృషి చేశాం. ఈవీ ఉత్పత్తుల్లో పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ అవతరించేందుకు ఈ రేసును ఉపయోగించుకున్నాం’ అని కేటీఆర్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
Also Read బాబుకు భారీ షాక్.. టీడీపీకి కేశినేని నాని రాజీనామా
గతేడాది అక్టోబర్ 30వ తేదీన ఈ రేసును అప్పటి తెలంగాణ ప్రభుత్వం రేసును అత్యంత విజయవంతంగా నిర్వహించింది. ఈ రేసు సీజన్ 10కి చెందిన నాలుగో రౌండ్ హైదరాబాద్ లో నిర్వహించాల్సి ఉంది. ఈ రేసు రద్దు కావడంతో తెలంగాణ మున్సిపల్ శాఖ హోస్ట్ సిటీ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని నిర్వాహకులు తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించింది.